హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): అన్ని రాష్ర్టాల్లోనూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయం సాధించాలని అతడు ఆకాంక్షించాడు. కొట్లాడి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ ఢిల్లీ గద్దెనూ అధిరోహించాలని, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అన్ని రాష్ర్టాల ప్రజలకు తెలియజేయాలని దేశవ్యాప్త బైక్యాత్రకు శ్రీకారం చుట్టాడు షా జహంగీరుద్దీన్ సిద్ధిఖీ అజ్మీర్. తన ద్విచక్రవాహనాన్ని బీఆర్ఎస్ ఫ్లెక్సీలతో కూడిన బోర్డులు, జెండాతో అందంగా అలంకరించి రోడ్డెక్కాడు.
హైదరాబాద్లోని మాసబ్ట్యాంకు నుంచి తన బైక్ యాత్రను ప్రారంభించాడు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్-10లోని జహీరానగర్లో సిద్ధిఖీ మీడియాతో మాట్లాడాడు. ‘నేను మొదటినుంచీ టీఆర్ఎస్ పార్టీలో లేను. బీఆర్ఎస్గా మారాక సీఎం కేసీఆర్కు అభిమానిగా మారిపోయా. కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ దేశంలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నా. మాసబ్ట్యాంక్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ యాత్ర రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చేరుకుంటుంది. కేసీఆర్ వందేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని అక్కడ ప్రార్థనలు చేస్తా. ఢిల్లీ, హర్యా నా, పంజాబ్, యూపీ..ఇలా దేశమంతా నా బైక్ యాత్ర కొనసాగుతుంది’ అని జహంగీరుద్దీన్ తెలిపాడు.
(గడ్డం సతీశ్)