నస్రుల్లాబాద్, మార్చి 11: బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా పంటలను కా పాడుతామని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు భరో సా ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని నల్లజెరు చెరువును ఆయన సోమవారం పరిశీలించా రు. ఈ యాసంగిలో నిజాంసాగర్ ఆ యకట్టు పరిధిలో అలీసాగర్ వరకు 1.30 లక్షల ఎకరాలకు ఏడు విడతలు గా సాగునీరందించడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం ఆరో విడత నీటి విడుదల కొనసాగుతున్నదని, రైతులు నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.