కొండాపూర్, అక్టోబర్ 5: జర్మనీ రాజధాని బెర్లిన్లో ఈ నెల 8 నుంచి 10 వరకు హంబోల్డ్, ఫ్రాంక్ఫోర్ట్, ఫ్రీబోర్జీ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇస్లామిక్ సదస్సుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీ స్కాలర్లు ఎంపికయ్యారు. సీఏఎల్టీఎస్ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థులు అయూబ్ రెహ్మాన్, మహ్మద్ వాసిల్ ఈ సదస్సులో పేపర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు హెచ్సీయూ యాజమాన్యం మంగళవారం తెలిపింది.