హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులను న్యాయస్థానాలు ఎలా పరిశీలిస్తాయని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేటాయింపులపై సమీక్ష చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని స్పష్టం చేసింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఉత్తర్వులు చెల్లవన్న కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కేంద్రానికి పంపిస్తామని తెలిపింది.
డీజీపీ అంజనీకుమార్ సహా 12 మంది ఆలిండియా సర్వీసు అధికారుల కేటాయింపునకు సంబంధించిన వివాదంపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టి స్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపిం ది. అధికారుల కేటాయింపులు జరిగి చాలా ఏండ్లయినందున వారిలో కొం దరు పదవీ విరమణ చేసి ఉంటారని, మరికొందరు పదవీ విరమణకు చేరువై ఉంటారని పేర్కొన్న ధర్మాసనం.. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేం ద్రాన్ని ఆదేశిస్తామని చెప్పింది. విచారణను జనవరి 2కు వాయిదా వేసింది.