హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలి మ్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు ని రాకరించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా పరీక్షలను వాయిదా వేయాలని, దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ పీ మాధవీదేవి మంగళవారం విచారణ జరిపారు.
సిట్ దర్యాప్తు పూర్తవకుండానే పరీక్షల ని ర్వహణ అన్యాయమన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చారు. జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న మరో పిటిషన్ విచారణలో ఉన్నదని టీఎస్పీఎస్సీ న్యాయవాది చెప్పారు. ఆ పిటిషన్ను పెండింగ్లో ఉన్న అదే తరహా పిటిషన్తో కలిపి విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది.