సౌతాంప్టన్: టీమ్ఇండియా క్రికెటర్లకు ఒకింత ఊరట లభించింది. ప్రస్తుతం మూడు రోజుల కఠిన క్వారంటైన్లో ఉన్న ప్లేయర్లు..జిమ్తో పాటు మైదానంలో వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేసుకునేందుకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. ఒక్కో క్రికెటర్కు నిర్ణీత సమయాన్ని కేటాయిస్తూ ఒకరినొకరు కలుసుకోకుండా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సౌతాంప్టన్ మైదానంలో సీనియర్ బ్యాట్స్మన్ పుజారా శనివారం కొద్దిసేపు జాగింగ్ చేశాడు. ఈ వీడియోను పుజారా తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మైదానానికి ఆనుకోని ఉన్న హిల్టన్ హోటల్లో బస చేస్తున్న టీమ్ఇండియా క్రికెటర్లు ఆదివారం నుంచి శిక్షణ మొదలుపెట్టే అవకాశముంది. అయితే అందరూ కలిసి కాకుండా చిన్న చిన్న గ్రూపులుగా జిమ్ సెషన్లలో పాల్గొననున్నారు.