హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సేకరణ సజావుగా కొనసాగుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో పౌర సరఫరాల కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా ఇదే రోజుకి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామన్నారు.
గత నవంబర్ నెలలో 25.84 మెట్రిక్ టన్నులు సేకరిస్తే, 6734 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 38.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ప్రైవేట్లో సైతం ఎంఎస్పీ కన్నా అధికంగా దర రావడం శుభ పరిణామమన్నారు. డిసెంబర్లో ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుందని, ప్రభుత్వం అందుకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
ఇప్పటి వరకు రూ. 7837 కోట్లకు గాను రైతులకు రూ. 4780 కోట్లు చెల్లించామన్నారు. ఈ సీజన్లో 9.52 లక్షల గన్నీలు వాడగా 9.16లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే 729 కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తై మూసేసామన్నారు,ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కమిషనర్ వి.అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.