హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా హరర వేణుగోపాలరావు గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని ఐదో అంతస్థులో ఆయనకు కేటాయించిన కార్యాలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఆయనను మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్రావు, జీఏడీ కార్యదర్శి రఘునందన్రావు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్రెడ్డి, మాజీ ఎంపీలు హనుమంతరావు, సుబ్బరామిరెడ్డి, మధు యాషీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి అభినందించారు.