హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) పార్థివదేహాని బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. కార్ఖానాలో నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కేకే, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దారం నాగేందర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్పొరేటర్ విజయా రెడ్డితోపాటు పలువురు నాయకులు ఆమె భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడి చేరుకోనున్నారు.
శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు పటాన్చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై అదుపుతప్పి రెయిలింగ్కు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ఇవాళ సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.