హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో లక్షలాది మంది యు వత భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మద్యం వ్యాపా రం కోసం మాత్రం ఆగమేఘాల మీద 121 బ్రాండ్లకు నోటిఫికేషన్ జారీ చే యడం ఏందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు.
నిరుద్యోగులకు ఉ ద్యోగాలు కల్పించడం కంటే మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎకువ శ్రద్ధ ఉన్నట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. ‘జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక ర్ నోటిఫికేషన్లు ఫుల్.. ఇదేనా రేవంత్రెడ్డి చెప్పిన ప్రజాపాలన?’ అని నిలదీశారు. ప్రభుత్వ తీరుపై సోమవారం ఆయన ప్రకటనలో మండిపడ్డారు. డిగ్రీ లు, పీజీలు పూర్తిచేసిన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. ప్రభు త్వం మద్యం దుకాణాలు, బ్రాండ్ల సం ఖ్యను పెంచి ఆదాయం సమకూర్చుకోవడంపైనే దృష్టిపెట్టిందని విమర్శించా రు. రాజీవ్ యువవికాసం వికసించక వాడిపోయిందని, హామీలకు అతీగతీ లేకుండా పోయిందని విమర్శించారు. ‘రేవంత్ పగ.. యువత దగ’ అన్నట్టు పరిస్థితి మారిందని విమర్శించారు.