Harish Rao | కాంగ్రెస్ పార్టీ ఫేక్ అకౌంట్లతో(Fake account) ప్రతిపక్షాలపై దుర్మార్గమైన దాడికి పాల్పడుతున్నది.కాంగ్రెస్(Congress party,) నడిపే ఫేక్ అకౌంట్ను పట్టుకొని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాడని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంధ్యా రావు అనేఫేక్ అకౌంట్లో పోస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్లే.. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. ఫేక్ అకౌంట్ మీద తక్షణమే విచారణ జరిపించి వాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫేక్ అకౌంట్ ఆధారంగా అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం.. రేవంత్ రెడ్డి మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా ఇస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నడిపే ఫేక్ అకౌంట్ను పట్టుకొని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాడు
ఆ దొంగ ఫేక్ అకౌంట్ మీద ఈ రోజు కంప్లైంట్ ఇస్తున్నాం
ఆ ఫేక్ అకౌంట్లో పోస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్లే.. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో… https://t.co/AGTZ33zqFC pic.twitter.com/aHmTlryO9w
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026