సిద్దిపేట : అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం. అలాంటి ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో రామకృష్ణ సేవా సమితి(Ramakrishna Math) ఆధ్వర్యంలో జరిగిన గర్భిణుల(Pregnant )అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
తల్లి తీసుకునే ఆహారమే పుట్టబోయే బిడ్డ ఎదుగులపై ప్రభావం చూపుతుందన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణులు శారీరక, మానసిక ఒత్తిడి కలుగకుండా ఇంట్లో, బయట మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. నార్మల్ డెలివరీలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గర్భిణులకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చి వారు ఆరోగ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుందని గుర్తు చేశారు.