Harish Rao | సిద్దిపేట : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు 800 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో శుక్రవారం జరిగింది. సిద్దిపేట అర్బన్, నంగునూర్ మండలాలకు చెందిన 800 మంది మహిళలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వారందరికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు హరీశ్రావు. ఈ సందర్భంగా హరీశ్రావుకు లబ్దిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హరీశ్రావుకు ఎంతో రుణపడి ఉంటామని పేర్కొన్నారు.