హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సమాచార పౌరసంబంధాలశాఖ నూతన కమిషనర్గా నియమితులైన ఎం హనుమంతరావు సోమవారం మాసబ్ట్యాంక్ సమాచార భవన్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆ శాఖ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని అట్టడుగుస్థాయి నుంచి ప్రచారం చేయడంలో సమాచారశాఖ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. అనంతరం సచివాలయంలో ఐఅండ్పీఆర్ ప్రత్యేక కార్యదర్శిగానూ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎఫ్డీసీ కిషోర్బాబు, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్లు జగన్, వెంకట్మ్రణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సీఐఈ రాధాకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
అనిత బాధ్యతల స్వీకరణ
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ అనితారామచంద్రన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆమెను పీఆర్ ఆర్డీ కమిషనర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన ఆమెను పలువురు అధికారులు అభినందించారు. అనంతరం శాఖకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.