వరంగల్, నవంబర్ 13 : మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి (86) కన్నుమూశారు. హనుమకొండలో నివా సం ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో జన్మించిన మందాడి సత్యనారాయణరెడ్డి ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా జనసంఘ్, బీజేపీలో వివిధ పదవుల్లో క్రియాశీలకంగా పనిచేశారు.
ఆ తర్వాత 2001లో టీఆర్ఎస్లో చేరి 2004లో హనుమకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత కొంతకాలానికి బీజేపీలో చేరారు. మందాడి మృతిపట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ తదితరులు సంతాపం తెలిపారు.