నీలగిరి : చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించి ఇతర ముడి సరుకుల ధరలను పెంచిన బీజేపీని ఓడించేందుకు చేనేత కార్మికులు సిద్ధం కావాలని నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జిల్లా మార్కండేయులు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళీధర్ పిలుపునిచ్చారు. గురువారం మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామంలో చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు మద్దతు తెలుపుతూ రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
మునుగోడు ఉపఎన్నికలలో చేనేత కార్మికులంతా ఐక్యంగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తూ నేతన్నల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్ల ఉపాధ్యక్షుడు కర్నాటి శ్రీరంగం, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి ఐతగోని లాల్ బహదూర్ గౌడ్,నేత కార్మికులు పాల్గొన్నారు.