హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): కేంద్ర వస్త్ర, చేనేత మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర చేనేత శాఖ హైదరాబాద్ పీపుల్స్ప్లాజాలో శనివారం జాతీయ చేనేత ప్రదర్శన-2023ను ఏర్పాటుచేసింది. ఈ నెల 24 వరకు కొనసాగే ఈ ప్రదర్శనను ఆ శాఖ అదనపు సంచాలకులు పీ వెంకటేశం ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన 153 చేనేత సొసైటీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటుచేశాయి.
తెలంగాణ సహా ఏపీ, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టాలు చేనేత సొసైటీలను స్పాన్సర్ చేస్తున్నాయి. అన్నిరకాల వస్ర్తాలపై 20-30 శాతం వరకు రిబేట్ ఇస్తున్నారు.