హైదరాబాద్, మార్చి 13(నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)కు భారీ కాంట్రాక్టు దక్కింది. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ.. జలాంతర్గామి రీఫిట్ కాంట్రాక్టును హెచ్ఎస్ఎల్కు అందజేసింది. నౌకాదళంలో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ సింధుకీర్తి సంబంధించిన రూ.934 కోట్ల ఆర్డర్ను షిప్యార్డ్కు అప్పగించారు. రీఫిట్ ద్వారా ప్రత్యామ్నాయ మరమ్మతుల వ్యవస్థ అభివృద్ధి అవుతుంది. ఇందులో దాదాపు 20కిపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల సేవలను హెచ్ఎస్ఎల్ వినియోగించుకోనున్నది. వెయ్యి రోజుల పని దినాలను అందించే ఉపాధి కల్పనగా ఈ ప్రాజెక్టు కొనసాగనున్నది.