న్యూస్నెట్వర్క్/హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్తో చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. రాజకీయ ప్రముఖులతోపాటు సినీరంగ ప్రముఖులు, కవులు, కళాకారులు, చేనేత రంగంపై ఆధారపడిన వర్గాలన్నీ కదిలాయి. మంగళవారం ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు చింతకింది మల్లేశం, గజం గోవర్ధన్ తదితరులు ప్రధానికి పోస్టుకార్డులు పంపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో నేతన్నలు పోస్టుకార్డులు రాశారు. చౌటుప్పల్ పట్టణంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఆధ్వర్యంలో 200 మంది లేఖలు రాశారు.
సంస్థాన్ నారాయణపురంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. పుట్టపాకలో నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే విద్యాసాగర్ పాల్గొన్నారు. సీపీఎం, సీపీఐ నేత లు మద్దతు పలికారు. నారాయణపురంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆధ్వర్యంలో పోస్టుకార్డులు రాశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో సిరిపురంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ధర్మపురి పద్మశాలి సేవా సంఘం, పెగడపల్లి పద్మశాలి సం ఘం, హుజూరాబాద్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోస్టుకార్డుల ఉద్య మం కొనసాగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో వస్త్ర వ్యాపారులు, చేనేత వ్యాపారులు, రెడీమేడ్ దుకాణ వ్యాపారులు పోస్టుకార్డులు రాశా రు. మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో ఏకంగా 10 వేల కార్డులు రాశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నేతకార్మికులు పోస్టుకార్డులు రాసి ప్రధానికి పం పించారు. ఆర్మూర్లో ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ప్రధానికి లేఖ రాశారు.
చేనేత సమస్యలపై రాహుల్తో భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): చేనేతపై జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పద్మశాలి సంఘం నాయకులు, చేనేత ఉద్యమకారులు కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీని కోరనున్నారు. రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీతో ఈ నెల 28న భేటీ కానున్నారు. చేనేత మహావస్త్ర లేఖపై రాహుల్గాంధీ సంతకం చేయనున్నారని జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న తెలిపారు. చేనేత మహావస్త్ర లేఖపై ఇప్పటికే 18 మంది కాంగ్రెస్ ఎంపీలతో సహా 66 మంది ఎంపీలు సంతకాలు చేశారని వివరించారు. చేనేత సమస్యల శాశ్వత పరిష్కారం, జాతీయ చేనేత విధానం గురించి రాహుల్గాంధీతో చర్చిస్తామన్నారు.
చేనేతను ఆదుకోవాలి: ఎర్రబెల్లి
జీఎస్టీని వెంటనే రద్దు చేసి, చేనేతరంగాన్ని ఆదుకోవాలని ప్రధాని మోదీకి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం ప్రధానికి పోస్టుకార్డు రాశారు. దేశంలో వ్యవసాయం తరువాత ప్రజలు ఎక్కువగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు.
జీఎస్టీని రద్దుచేసే వరకు పోరాటం: సుద్దాల అశోక్తేజ
మంగళవారం ప్రధానికి పోస్టుకార్డు పంపిన సుద్దాల అశోక్ తేజ.. చేనేతపై జీఎస్టీని రద్దు చేయాల్సి న ఆవశ్యకతను వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశా రు. చేనేత కార్మికుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నదని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నలతో బతుకమ్మ చీరలను తయారు చేయించి పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. చేనేతను కాపాడేందుకు కేటీఆర్ చేపట్టిన ఉద్యమానికి ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దుచేసే వరకు పోరాటం చేయాలని విజ్ఞప్తిచేశారు.
నేతన్నలు ఉపాధి కోల్పోతారు: చింతకింది మల్లేశం
చేనేతపై జీఎస్టీ కారణంగా వస్ర్తాల ధర పెరిగి కొనుగోళ్లు తగ్గుతాయని, నేతన్నలు ఉపాధి కోల్పోతారని చింతకింది మల్లే శం ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. యంత్రాలపై చేసే వస్తువులతో పోల్చుకొంటే.. చేతితో చేసే వస్తువుల ధర సహజంగానే ఎక్కువగా ఉంటుందని వివరించారు. జీఎస్టీ వల్ల చేనేత రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాని సహృదయంతో ఆలోచించి జీఎస్టీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు.
చేనేతను కాపాడాలి: గజం గోవర్ధన్
చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని ప్రధానికి రాసిన పోస్టుకార్డులో గజం గోవర్ధన్ డిమాండ్ డిమాండ్ చేశారు. కొత్త తరం నిరాసక్తత వల్ల రోజురోజుకూ అంతరించిపోతున్న చేనేత రంగాన్ని కాపాడుకొనేందుకు కేంద్రం నడుం బిగించాల్సిన ఆవశ్యకత ఉన్నదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేనేతబీమా, త్రిఫ్ట్, యార్న్పై 40% సబ్సిడీ, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం తదితర రూపాల్లో ఈ రంగాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తుంటే, కేంద్రం జీఎస్టీ పేరుతో అణగదొక్కుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.