హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన నగదును బాధితులకు అప్పగించే విషయంలో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్సీఎస్బీ)తో అన్ని జిల్లా, సైబర్ క్రైం యూనిట్లు సమన్వయంతో ముందుకెళ్లాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. హైదరాబాద్లోని టీఎస్సీఎస్బీ ప్రధాన కార్యాలయానికి అనుబంధంగా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, ఖమ్మంలో సైబర్క్రైం, జిల్లా సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెల్లు స్థాపించినట్టు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వర్షాప్లో ఆయన మాట్లాడుతూ.. క్రిప్టో, ఇంటర్నెట్ సంబంధిత సమస్యలు, వీఓఐపీ వంటి కొత్త సవాళ్లను పరిష్కరించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని డీజీపీ కోరారు.