టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ
ముషీరాబాద్, ఫిబ్రవరి 11: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను అవమానించి, సబ్బండ కులాల మనోభావాలను దెబ్బతీసిన హమారా ప్రసాద్ను దేశ బహిష్కరణ చేయాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆయ న విద్యానగర్లో మీడియాతో మాట్లాడు తూ.. అంబేద్కర్ను అవమానించడమం టే దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానించినట్టేనని పేర్కొన్నారు. సమాజంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఉపేక్షించవద్దని, ప్రసాద్ వెనుక ఎవరున్నారో కనిపెట్టి తగిన బుద్ధిచెప్పాలని కోరారు. బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నదని, దీనికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రసాద్ మాటలు ఆయన వ్యక్తిగతమా? లేక బీజేపీ విధానమా స్పష్టం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వంగపల్లి డిమాండ్ చేశారు.