సూర్యాపేట : సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy )కి మద్దతుగా కార్మిక సంఘాలు ఏకమవుతున్నాయి. తాజాగా సూర్యాపేట మున్సిపాలిటీ లోని దిగుమతి హామాలీ సంఘానికి చెందిన 500 కుటుంబాలు ఏకగ్రీవంగా తమ మద్దతును ప్రకటించారు. 2014 కు ముందు సరైన ఉపాధి లేక పస్తులు ఉన్న తమకు జగదీష్ రెడ్డి వచ్చాకే, చేతినిండా పని, పొట్ట నిండా తిండి దొరుకుతుందని హామాలీ సంఘం నేత రాజు, సైదులు, భూపాల్ తెలిపారు.
మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో వేలకోట్లతో చేస్తున్న అభివృద్ధి, అదుపులో ఉంచిన శాంతి భద్రతల కారణంగా, వెల్లువలా వచ్చిన వ్యాపార సంస్థలతో తమకు చేతినిండా ఉపాధి లభిస్తుందని అన్నారు.
సమాజంలో గౌరవంగా బతుకుతున్నామని తెలిపారు. తమ బతుకులను బాగు చేసిన జగదీష్ రెడ్డి కే మారోసారి మా మద్దతు అన్నారు. మంత్రి గెలుపు కోసం ఇంటికొకరం చొప్పున స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహించి, మంత్రి హ్యాట్రిక్ విజయంలో భాగస్వామ్యం అవుతామని తెలిపారు.
మంత్రి జగదీష్ రెడ్డిని తమ భవనానికి ఆహ్వానించిన హమాలీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ నాకు మద్దతు తెలిపిన హమాలీ సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి, భవిష్యత్తు లో హమాలీ సంఘం భవన విస్తరణకు, కార్మిక చట్టాల ప్రకారం ప్రభుత్వం తరఫున వారికి వర్తించే అన్ని సదుపాయాలు కూడా వర్తింప చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, బీఆర్టీయూ జిల్లా నాయకులు గురూజీ, కార్మిక సంఘం నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు సవరల సత్యనారాయణ, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు తదితరులు పాల్గొన్నారు.