Half day School | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 నుంచి ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది. ఉదయం 8 నుంచి 12.30గంటల వరకు తరగతులు నిర్వహించాలని, ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వార్షిక పరీక్షల నేపథ్యంలో పదో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని చెప్పింది. మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ఈ మేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా ఆదేశాలను అమలు చేయడంతో పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు.