హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : శాసనమండలి, శాసనసభ మధ్యలో మిగిలిపోయిన సెంట్రల్ హాల్ పనులను ప్రారంభించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ఆర్అండ్బీ, ఆగాఖాన్ సంస్థ, తెలంగాణ లెజిస్లేచర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సౌకర్యవంతంగా ఉండేలా సెంట్రల్ హాల్ను డిజైన్ చేసి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా తెలంగాణ హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలోని అన్ని మ్యూజియాలు, చారిత్రక కట్టడాలకు ఈ నెల 18న ఉచిత ప్రవేశాలను కల్పిస్తున్నట్టు సాంస్కృతికశాఖ తెలిపింది. పబ్లిక్గార్డెన్లోని స్టేట్ మ్యూజియంలో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు వెల్లడించింది.