పెద్దఅంబర్పేట, జూలై 3: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి నల్లగొండ వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో విజయవాడ జాతీయ రహదారిపై గుత్తా కాన్వాయ్కి అకస్మాత్తుగా పశువులు అడ్డొచ్చాయి. దీంతో కాన్వాయ్లోని ముందు వాహన డ్రైవర్ బ్రేక్ వేయడంతో అందులోని మరో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం అనంతరం గుత్తా తిరిగి హైదరాబాద్కు వెళ్లినట్టు సమాచారం.