నల్లగొండ: కాంగ్రెస్ మ్యానిఫెస్టో మభ్యపెట్టేదేనని శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. ఎలాగైనా కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. వారు ప్రకటించిన మ్యానిఫెస్టో ఉత్తదేనని, ఆచరణ సాధ్యంకానిదన్నారు. డిక్లరేషన్లు అంటూ అన్నివర్గాలను మభ్యపెడుతుదని ఆరోపించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అభివృద్ధి సక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
తెలంగాణలో చెబుతున్న పథకాలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ (Congress) ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్పై అక్కసు వెళ్లగక్కడం ఒక్కటే కాంగ్రెస్ పని అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖర్గే లాంటి డమ్మీ నాయకులను ముందు పెట్టి కుటుంబ పాలన చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. అభివృద్ధి నిరోధక పార్టీ కాంగ్రెస్ అని, మత కల్లోలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు వస్తే తెలంగాణ రాష్ట్రం అగమ్యగోచరంగా తయారవుతుందని చెప్పారు. మోదీ, అమిత్ షాలు తెలంగాణ పై విషం చిమ్మితున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే బీజేపీ పట్టించుకోలేదన్నారు.
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సిటు కూడా రాదని జోష్యం చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నకిరేకల్లో ఓ దళిత ఎమ్మెల్యేను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎన్నోసార్లు చిత్తుచిత్తుగా ఓడిపోయిన కోమటిరెడ్డి బ్రదర్స్కి మరోసారి ద్దరు ఓటమితప్పదని తెలిపారు. అన్నదమ్ములిద్దరు కలిసి జిల్లాలో రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.