యాదాద్రి భువనగిరి : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్నుమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు.
నిరుద్యోగుల కోసం ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.