హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): వసతులు సక్రమంగా లేవనే సాకుతో ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో అకడమిక్ అధికారులు 12 కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టకూడదని నిర్ణయించారు. తల్లిదండ్రుల ఒత్తిడితో 5 కాలేజీల్లో ప్రవేశాలను కల్పించేందుకు సొసైటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మిగతా 7కాలేజీల్లో మాత్రం 2026-27 విద్యాసంవత్సరంలోనూ అడ్మిషన్లకు నిరాకరిస్తుండడం గమనార్హం. అందులో ప్రధానంగా చొప్పదండి, డోర్నకల్, మంథని, అందోల్లోని బాలికల, దుబ్బాక, అలంపూర్, జుక్కల్లోని బాలుర గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను కల్పించడం లేదు.
రిక్రూట్మెంట్కే జీవో 1274
బాలికల గురుకులాల్లో మహిళా సిబ్బందినే నియమించాలని జారీ చేసిన జీవో 1274 రిక్రూట్మెంట్ సందర్భంలోనే వర్తిస్తుందని ఆల్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ వెర్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య, ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియామకాల వరకే జీవో పరిమితమన్నారు. కానీ అందుకు విరుద్ధంగా గతంలో బదిలీలను నిర్వహించారని వివరించారు.