హైదరాబాద్ : ఈ నెల 24న గురు పౌర్ణమి వేడుకలకు హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మఠంలోని పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ ఉంటుందని, మరికొన్ని పుస్తకాలపై 20% దాకా డిస్కౌంట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రామకృష్ణ మఠం ప్రతినిధులు సూచించారు.
గురుపూర్ణిమ సందర్భంగా ఈ నెల 24న ఉదయం 7 గంటలకు విశేష పూజ, ఉదయం 8 గంటలకు భజనలు, ఉదయం 10:45కు హోమం, 11:15కు తెలుగులో ప్రసంగం ఉంటాయి. ఉదయం 11:40కి ముండకోపనిషత్తు నూతన పుస్తక ఆవిష్కరణతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12:05 నిమిషాలకు విశేష హారతి, సాయంత్రం 6:45కు ఆరాత్రికం ఉంటాయి. రాత్రి 7:15 నిమిషాలకు ప్రత్యేక భజనలుంటాయి.