హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురుపౌర్ణమి (Guru Purnima) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. విద్యుత్ వెలుగు ఆలంకరణతో భక్తులను ఆకట్టుకుంటున్నది.
ఇక, హనుమకొండలోని సాయిబాబా క్షేత్రంలో, కరీంనగర్లోని సీతారాంపూర్, భాగ్యనగర్, సాయినగర్ సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకుంటున్నారు.
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురుపౌర్ణమి అని పిలుస్తారు. హిందులు ప్రతిఏడాది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజును గురుపూజోత్సవం జరిపి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం శుభసూచకమని భావిస్తారు.