ములుగు : సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జనరంజక పాలన అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఊరూ వాడాజై కొడుతున్నాయి. మేమంతా బీఆర్ఎస్తోనే అంటూ నినదిస్తున్నాయి. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓట్లన్నీ బీఆర్ఎస్కే’ అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి.
అందులో భాగంగా..ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని గుర్రంపేట గ్రామం కూడా శనివారం ఏకగ్రీ వ తీర్మానం చేసింది. ‘త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మా మద్దతు బీఆర్ఎస్ పార్టీకే.. మా ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికే, గంపగుత్తగా కారు గుర్తుకే ఓట్లేస్తాం’ అని గ్రామస్తుల పూర్తి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించి ప్రమాణం చేశారు.