హైదరాబాద్: పాతబస్తీ మొఘల్పురాలోని సుల్తాన్షాహీలో కాల్పులు కలకలం సృష్టించాయి. సుల్తాన్షాహీకి చెందిన అఫ్సర్ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడమీద బల్లిపై కాల్పులు జరిపాడు. అయితే ఆ బుల్లెట్ గోడకు తగలడంతో కొంత పెచ్చు ఊడి అక్కడే ఉన్న ఆజాన్ అనే ఎనిమిదేండ్ల బాలుడిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని స్థానికులు దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఆయుధంతో కాల్పులు జరిపాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు.