దేవరుప్పుల, అక్టోబర్ 21: సద్దితిన్న రేవు ను మరవద్దన్న చందాన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన గుమ్మడవెళ్లి రాజకుమారి తాను కుట్టుమెషిన్పై ఆర్జించిన డబ్బును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నామినేషన్ ఖర్చులకు అందజేసి ఆదర్శంగా నిలిచింది.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళలకు అందించిన కుట్టుశిక్షణలో చేరిన రాజకుమారి కుట్టుశిక్షణ పూర్తి చేయగా ఆమెకు ట్రస్ట్ ఉచితంగా కుట్టుమెషిన్ అందజేసింది. దీంతో ఆమె కుటుం బం ఉపాధి పొందుతుండగా డబ్బులను పోగుచేసింది.
శనివారం గ్రామానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లిని రాజకుమారి తన ఇంటికి ఆహ్వానించి.. తన వారం రోజుల సంపాదన గల్లపెట్టె నుంచి లెక్కబెట్టకుండా మంత్రికి అందజేసింది.