హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేసీజీఎల్ఏ-2152) కొత్త కమిటీ ఎన్నికైంది. గురువారం ఆన్లైన్లో అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా కోడి మహేశ్కుమార్, కోశాధికారిగా బండి కృష్ణ, ముఖ్య సలహాదారులుగా ఎం జంగయ్య, ఎం రామకృష్ణగౌడ్ను ఎన్నుకున్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎం బాబురావు, ఎల్ శ్రీకాంత్రావు, సీహెచ్ దేవయ్య, ఏ రమేశ్రెడ్డి, కే కవిత, మహిళా కార్యదర్శులుగా జీ శ్రీవిద్య, వనమణి, పీ రీనా, జీ రాధిక, సంయుక్త కార్యదర్ళులుగా పీ రామ్మూర్తి, కే సమ్మయ్య, అబ్దుల్ నబీ, నెమలి గాంధీ, బీ యాకేశ్, అధికార ప్రతినిధులుగా డాక్టర్ జీ ప్రసాద్, కే నవీన్రెడ్డి, డాక్టర్ కే యుగంధర్, మీడియా ఇంచార్జులుగా కే వెంకటేశ్, ఎస్ పరమేశ్, బిళ్ల రమేశ్, లీగల్ సెల్ ఇంచార్జిగా అరుణ్కుమార్తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.