న్యూఢిల్లీ, డిసెంబర్ 6: జీఎస్టీ అదనపు కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జీఎస్టీ కేసులను మ్యానేజ్ చేస్తానని అతడు పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సీబీడీటీ గుర్తించింది.
అతడిపై 180 రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో కూడా ఇలాంటి ఆపరోపణలతోనే ఈతడు సస్పెన్షన్కు గురయ్యాడు. ఇతడిపై గతంలో ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి.