CM KCR | మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పథకాలను ప్రారంభించింది. నూతన పథకాలైన గృహలక్ష్మి, కులవృత్తులకు ఆర్థిక సాయం పథకాలతో పాటు రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని మంచిర్యాల జిల్లా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గృహలక్ష్మి, బీసీ కులాల్లోని కులవృత్తుల లబ్దిదారులకు కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందించారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కింద లబ్దిదారులకు కేసీఆర్ గొర్రెలను పంపిణీ చేశారు. గృహలక్ష్మి, కులవృత్తుల వారు, గొర్రెల లబ్దిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చెన్నయ్య, జోగు రామన్న, దివాకర్ రావు, రేఖా నాయక్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.