ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, మే 30: సాధించాలనే తపన ఉంటే ఉద్యోగం తప్పనిసరిగా వరిస్తుందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని ఎక్స్పో ప్లాజాలో గ్రూప్స్ అభ్యర్థులకు శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమానికి మంత్రి హాజరై, పరిశీలించారు.
గతంలో కోచింగ్ అంటే హైదరాబాద్కు వెళ్లడమే అన్న పరిస్థితి ఉండేదని, నేడు నిరుద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి సహకారమైనా అందిస్తామని, అందరూ ఉద్యోగాలు సాధించే దిశలో కృషి చేయాలని కోరారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటు చేసిన భోజనాన్ని ఉద్యోగార్థులతో కలిసి తిన్నారు. అనంతరం మహబూబ్నగర్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.