హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 అభ్యర్థుల కోసం గురువారం నుంచి మరో మూడు గంటలపాటు అదనంగా పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నట్టు టీ-శాట్ సీఈవో ఆర్ శైలేశ్ రెడ్డి తెలిపారు. టీ-శాట్ నెట్వర్ ద్వారా నెల రోజులుగా రెండు గంటల పాటు పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నామని వెల్లడించారు.
నిపుణ చానల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇంగ్లిష్, జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, ఎకానమి సబ్జెక్టులపై ప్రసారాలుంటాయని వివరించారు. మరుసటి రోజు విద్య చానల్లో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు అవే పాఠ్యాంశాలు పున:ప్రసారమవుతాయని చెప్పారు. గ్రూప్-2 పరీక్ష ఈ నెల 29, 30న నిర్వహించనున్నందున మరిన్ని పాఠ్యాంశాలు అందించాలని నిర్ణయించినట్టు శైలేశ్ రెడ్డి చెప్పారు.