హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రం సివిల్స్ స్థాయిలో ఉన్నదని అభ్యర్థులు తెలిపారు. గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కంటే కాస్త కఠినంగా ఉన్నదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అందరూ ఆలోచించిన దానికంటే భిన్నంగా ప్రశ్నలు అడిగారని అంటున్నారు. అభ్యర్థిలోని సూక్ష్మ దృష్టిని పరీక్షించేలా ప్రశ్నలు వచ్చాయని, ఒక ప్రశ్నకు ఒకే జవాబు కాకుండా.. భిన్నంగా అడిగారని చెప్తున్నారు. విషయం గురించి పూర్తిగా తెలిస్తేనే సమాధానం గుర్తించేలా ప్రశ్నలు ఉన్న ట్టు తెలిపారు. ఎక్కువ మంది సివిల్స్ రాసే అభ్యర్థులు గ్రూప్-1కు పోటీ పడతారు. యూపీఎస్సీ పరీక్షలు రాసేటప్పుడు చాలామంది ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిస్తారు. అంటే.. ఒక ప్రశ్నకు నాలుగు జవాబులిస్తే.. జవాబును గుర్తించే క్రమంలో మొదట అం దులో నుంచి ఓ రెండు జవాబులను తీసేస్తా రు. మిగిలిన రెండింటిలో ఏది కరెక్టో ఆలోచించి పెట్టేస్తారు. దీనివల్ల తక్కు వ సమయంలో సమాధానం తెలిసే చాన్స్ ఉం టుంది. కానీ టీఎస్పీఎస్సీ ఇచ్చిన ప్రశ్నపత్రంలో ఈ ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించడం కుదరదని నిపుణులు అంటున్నారు.
70-80 మార్కులకే కటాఫ్!
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా ఉండటంతో ఈ సారి మెయిన్స్కు కటాఫ్ మార్కులు గణనీయంగా తగ్గే అవకాశమున్నదని అంటున్నారు. జనరల్ కోటాలో 70-80 మార్కుల మధ్యే కటాఫ్ ఉంటుందని సివిల్స్ మెంటార్ బాలలత, 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ అభిప్రాయపడ్డారు. కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్లో తెలంగాణ నుంచి 31 ప్రశ్నలు అడిగారు. కాళేశ్వరం, హరితహారం, రామప్ప, టీ హబ్, టీఎస్ ఎలక్ట్రికల్ వెహికిల్, ఉస్మానియా యూనివర్సిటీ, వైద్యరంగంలో కాయకల్ప అవార్డు, మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర, తెలంగాణలో మధ్యతరహా ప్రాజెక్టులు వంటి ప్రశ్నలు వచ్చాయి. ఇటీవలే జరిగిన కొత్త మండలాల విభజన గురించి కూడా ప్రశ్న అడిగారు.
‘నిపుణ’ నుంచి 40 ప్రశ్నలు
గ్రూప్-1 పరీక్షలో నమస్తే తెలంగాణ విద్య అనుబంధం ‘నిపుణ’ నుంచి 40 ప్రశ్నలొచ్చాయి. తెలంగాణ జాగ్రఫీ, హిస్టరీ, పాలసీ సబ్జెక్టుల నుంచి ఈ ప్రశ్నలు అడిగారు. తెలంగాణ టీఎస్ఎస్డీసీ, టీఎస్ఎస్వోసీఏ డైరెక్టర్కే కేశవులు గురించి ఒక ప్రశ్న వచ్చిం ది. తెలంగాణ అంశాల నుంచే 31 ప్రశ్నలు రావడం అభ్యర్థులకు కాస్త అనుకూలించే అంశం. గ్రూప్-1 ప్రిలిమ్స్కు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేయగా.. 2,86,051 మంది పరీక్ష రాశారు. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్కు సెలక్ట్ చేయాలని టీఎస్పీఎస్సీ భావించింది. అంటే.. 503 పోస్టులకు మెయిన్స్కు 5,721 మందిని ఎంపిక చేయనున్నారు. నెలరోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు.