హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 అర్హత పరీక్షకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య 1,05,740కి చేరింది. ఈ నెల 2న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నెలాఖరుతో గడువు ముగియనున్నది. శనివారం నాటికి 2,28,088 మంది ఓటీఆర్లో మార్పులు చేసుకొన్నారు. కొత్తగా 1,08,423 మంది ఓటీఆర్ నమోదుచేసుకొన్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.