హైదరాబాద్ : గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశం జలసౌధలో ప్రారంభమైంది. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుండగా.. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, ఓఎస్డీ దేశ్పాండే, ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్రెడ్డి, ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్లపై చర్చించనున్నారు.
తెలంగాణకు చెందిన చనాకా – కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లపై బోర్డు చర్చించనున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకటనగరం పంప్ హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్లపై చర్చించనున్నారు.