హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఏపీ అధికారుల గైర్హాజరు కారణంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. మంగళవారం జలసౌధలోని జీఆర్ఎంబీ సమావేశం జరగాల్సి ఉన్నది.
తెలంగాణ అధికారులు హాజరైనా, ఏపీ అధికారులు రాకపోవడంతో వాయిదా వేశారు. గురువారం లేదా మార్చి 1న సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నది.