హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో బుధవారం సినీ నటి జ్యోతి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు. ప్రతి ఒక్కరు గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.
ఇందులో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం హరితేజ, అషు రెడ్డి, రోల్ రైడా ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.