హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా గృహలక్ష్మి సీరియల్ నటి పూజితరెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో నటి కనకదుర్గమ్మ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కనకదుర్గమ్మ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ప్రకృతిని పరిరక్షించాలని వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు. మొక్కల వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని కనకదుర్గమ్మ అన్నారు. అనంతరం నటీమణులు రాగిణి, నవీనారెడ్డి, నటుడు టార్జాన్ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.