హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేశారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన, అకడి నగరాల మేయర్లను కలవడంతోపాటు వారితో కలిసి మొకలు నాటారు. ఈ విషయాన్ని ఆయన శనివారం ఎక్స్ వేదికగా ద్వారా పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. హెర్ట్స్మేర్ మేయర్ పర్వీన్ రాణి, ఎల్స్ట్రీ బోర్హామ్వుడ్ మేయర్ తుషార్కుమార్ను కలవడం తనకు దకిన గౌరవంగా పేర్కొన్నారు.
సమాజ సేవలో అంకితభావం, స్పష్టమైన విజన్తో దూసుకుపోతున్న ఈ ఇద్దరూ తల్లీకొడుకులు కావడం విశేషమని తెలిపారు. ఈ భేటీ సందర్భంగా వారందరూ కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఒక మొకను నాటారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా అందరికీ సమాన బాధ్యత ఉన్నదని సంతోష్ పేర్కొన్నారు.
ప్రజలందరినీ కలుపుకుంటూ సాగే వారి ప్రజారంజక పాలనాతీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నదని ప్రశంసించారు. ఈ సమావేశంలో పౌర నాయకత్వం, యువత భాగస్వామ్యం, పర్యావరణ నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ఈ స్నేహపూర్వక బంధం రాబోయే రోజుల్లో భారత్-బ్రిటన్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.