మొక్కలు నాటిన మైనార్టీ మత పెద్దలు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకుసాగుతున్నది. అఫ్జల్గంజ్ ఉస్మానియా దవాఖాన ప్రాంగణంలోని పార్కులో మైనార్టీ మత పెద్దలు బాబా ఫరీద్ సొసైటీ ఫ్యామిలీ హజ్హౌజ్ చైర్మన్ సజ్జాదా నషీన్, ఘజావుద్దీన్ నవాబ్ షాహిద్ ఫరీది బుధవారం గ్రీన్ చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం పలువురికి మొక్కలు నాటాలని చాలెంజ్ విసిరారు.