నిజామాబాద్ లీగల్, ఆగస్టు 17: నానమ్మను హత్య చేసిన మనుమడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరాకు చెందిన కొమిరె లక్ష్మి(80)కి ముగ్గురు కుమారులు. చిన్న కొడుకు భూమన్న చనిపోవడంతో అతని కుమారుడు గంగాధర్.. లక్ష్మి ఇంట్లోనే వేరొక గదిలో ఉంటున్నాడు.
రోజూ మద్యం తాగి వచ్చి నానమ్మతో గొడవపడే వాడు. ఈ క్రమంలో గంగాధర్ 29 ఫిబ్రవరి 2020న ఇంట్లో నిద్రిస్తున్న నానమ్మ ముఖంపై ఇటుకలు, కట్టెలతో కొట్టి హత్య చేశాడు. కేసు విచారణలో గంగాధర్ నేరం చేసినట్టు రుజువు కావడంతో జీవిత ఖైదుతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.