హైదరాబాద్ : ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్(Christmas) అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం చర్చి పాస్టర్లు ఆయనకు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..ఏసుక్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పర్వదినంగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.
డిసెంబర్ నెల మొత్తం క్రిస్మస్ వేడుకలతో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారని వివరించారు. ప్రతి ఒక్కరు ఏసు చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మి, టి.మహేశ్వరి, కుర్మ హేమలత, పాస్టర్లు శ్యాంసన్, విజయ్, క్రైస్తవ ప్రముఖులు ప్రాంక్లిన్, ప్రశాంత్, రాజ్ గోపాల్, దాస్, విలియమ్, జయరాజ్, మనోహర్, టోనీ, పాల్, రాజన్ స్మ్రిత్, జేరాల్డ్ జోసెఫ్, సాల్మన్, అలెగ్జాండర్, డిసిల్వా, సదాయ్ రాజ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, వెంకటేషన్ రాజు, ఆకుల హరికృష్ణ, నాయకులు శ్రీహరి, లక్ష్మీపతి, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.