సాధారణంగా ఎవరైనా చనిపోతే మగవారు మాత్రమే పాడె మోస్తారు. కానీ, తాత మీద ఉన్న ప్రేమతో అతని పాడెను మనుమరాళ్లు మోశారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన దండంపల్లి అంజయ్యగౌడ్ (70) అనారోగ్యంతో గురువారం మరణించాడు. అతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో అంజయ్యగౌడ్తోపాటు ఆయన సోదరుల మనుమరాళ్లు ఎనిమిది మంది కలిసి పాడె మోసి ఆయనపై తమకున్న మమకారాన్ని చాటుకున్నారు. – నల్లగొండ రూరల్