BRS | టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణలోని జిల్లాకేంద్రాలు, నగర కార్పొరేషన్, మున్సిపల్, మండల, గ్రామాలల్లో ఇవాళ టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.
నల్గొండ జిల్లాలో..
చిట్యాలలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో, నకిరేకల్ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.
సంగారెడ్డిలో..
బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తూ సంగారెడ్డి జిల్లా అంతటా టీఆర్ ఎస్ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి.
కరీంనగర్ జిల్లాలో..
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుతూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో సంబరాలు జరిగాయి. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. చొప్పదండి తదితర నియోజకవర్గ కేంద్రాల్లో కూడా సంబురాలు జరిగాయి.
వికారాబాద్ జిల్లాలో..
బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తూ జిల్లావ్యాప్తంగా వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలను ఘనంగా నిర్వహించారు. పరిగి, కొడంగల్ లో బాణాసంచా పేల్చారు.
భూపాలపల్లి జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనీ అంబేద్కర్ సెంటర్లో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఆసీఫాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలను నిర్వహించారు.
నిర్మల్ జిల్లా భైంసాలో..
సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ప్రకటనతో నిర్మల్ జిల్లా భైంసా పట్టణం, ఖానాపూర్ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు వేడుకలను నిర్వహించారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీ నిర్వహించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ..
దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో బాణసంచా పేల్చి, కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
వనపర్తి జిల్లాలో. .
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సంబురాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి సందడి చేశారు.
నాగర్కర్నూల్ లో..
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, పట్టణాల్లో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేశారు.
ములుగుజిల్లాలో..
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ములుగు పట్టణములో సంబరాలను నిర్వహించారు.
మహబూబ్నగర్లో..
జిల్లాలో బీఆర్ఎస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. దేశ్ కి నేత కేసీఆర్ అంటూ
నినాదాలు చేశారు. తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో..
జిల్లా కేoద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు.